బియ్యం ఒక రోజు ముందుగా నానబెట్టి . బాగా నానిన బియ్యాన్నికడిగి కొద్దిగా అరపోయాలి. ఆరబోసిన బియ్యాన్నిపిండి పట్టించి తడి ఆరనివ్వకుండా మూత పెట్టాలి.
బెల్లాని చిన్న ముక్కలుగా చేసి వేడి చేస్తూ ముదురు పాకం వచ్చాక యాలకుల పొడిని వేసి కలపాలి , తడి పిండిని పాకంలోకలుపుతూ ఉండలు కట్టకుండా కలపాలి . ఆ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పూరికంటే మందంగా వత్తుకొని నూనెలో వేసి ఎర్రగా వేగనివ్వాలి .
అరిసెల చట్ర్రం సహాయంతో నునే బాగా బయటకు వచ్చేంత వరకూ చేసి ఒక పేపర్ మీద ఉంచి చల్లారక డబ్బాలో పెట్టుకోవాలి.