స్టవ్ ఫై కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఉడకపెట్టిన గుడ్లను వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి.
ముందుగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, వెల్లులి రిబ్బలు, కాజు, సోంపు పొడి, దనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి వీటన్నిటిని కలిపి మిక్స్ పట్టి తగినన్ని నీళ్ళు పోసి పేస్టు లాగా చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై పెట్టిన అదే కడాయి లో 5 స్పూన్స్ నునె వేసి వేడి ఇయక సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసి వేగాక కరివేపాకు వేసి తరువాత మనం తయారు చేసిన మసాలను వేసి కలుపుకోవాలి, తరువాత టమాటో పేస్టు వేసి బాగా మగ్గనివ్వాలి.
ఇలా 10 నిమిషాల పాటు మగ్గాక నూనె పైకి తేలాక ఫ్రై చేసిన గుడ్లను వేసి కలిపి కొత్తిమిరను కూడా వేసి కలుపుకోవాలి.